KTR: సభ్యత్వ నమోదు చేసుకున్న వారందరికీ ఆగస్టు 1 నుంచి బీమా సౌకర్యం: కేటీఆర్

  • నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి
  • 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడం అరుదు
  • వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్

టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేసుకున్న వారందరికీ ఆగస్టు 1 నుంచి బీమా సౌకర్యం కల్పించనున్నట్టు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో సభ్యత్వ నమోదుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సూచించారు.

నియోజకవర్గాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్, నెలలోనే 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడం దేశ రాజకీయాల్లోనే అరుదన్నారు. గజ్వేల్, పాలకుర్తి నియోజకవర్గాలు సభ్యత్వ నమోదులో ముందుండటంతో వాటిని అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రూ.15 కోట్లు సభ్యత్వ రుసుం కింద అందినట్టు తెలిపారు.

More Telugu News