Sai Praneet: సరికొత్త చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ సాయి ప్రణీత్!

  • టోక్యోలో జపాన్ ఓపెన్ వరల్డ్ సూపర్ 750 టోర్నీ
  • క్వార్టర్ ఫైనల్స్ లో ప్రణీత్ ఘన విజయం
  • సెమీస్ కు చేరిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్తింపు

తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ సాయి ప్రణీత్ టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ వరల్డ్ సూపర్ 750 టోర్నీలో సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఈ టోర్నీలో సెమీస్ కు చేరిన తొలి భారత క్రీడాకారుడిగా ప్రణీత్ నిలిచి, కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ఇండొనేషియాకు చెందిన సుగియార్తోపై ఆది నుంచే ఆధిపత్యం చూపుతూ, 21-12, 21-15 తేడాతో విజయం సాధించి సెమీస్ కు అర్హత సాధించాడు. రెండో సెట్ లో సుగియార్తో నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా, ఒత్తిడికి తలొగ్గకుండా ప్రణీత్ చూపిన ప్రతిభ ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. కేవలం 36 నిమిషాల వ్యవధిలోనే ఈ గేమ్ ముగియడం గమనార్హం. కాగా, సెమీస్ లోనూ సాయి ప్రణీత్ విజయం సాధించాలని భారత బ్యాడ్మింటన్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

More Telugu News