Andhra Pradesh: ఏపీ రాజ్ భవన్ లో అధికారులతో గవర్నర్ సమావేశం

  • రాష్ట్రానికి సంబంధించిన వివరాలను చెప్పిన అధికారులు
  • ‘నవరత్నాలు’, ‘ఆరోగ్యశ్రీ పథకం’ అమలు గురించీ
  • ‘స్పందన’, ‘అమ్మఒడి’ వినూత్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్న గవర్నర్

ఏపీ రాజ్ భవన్ లో అధికారులతో గవర్నర్ బిశ్వభూషణ్ ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివరాలను గవర్నర్ కు అధికారులు ఎంకే మీనా, సంజయ్ గుప్తా తెలియజేశారు. ఈ సందర్భంగా ‘నవరత్నాలు’, ‘ఆరోగ్యశ్రీ పథకం’ అమలు గురించీ వివరించారు. గ్రామ వాలంటీర్ల నియామకం, వార్డు సచివాలయాల అమలు, స్పందన కార్యక్రమం, అమ్మఒడి పథకం వినూత్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలుగా గవర్నర్ అభివర్ణించినట్టు సమాచారం.

More Telugu News