Andhra Pradesh: చంద్రబాబు బంధువులు, బినామీలకు అమరావతిలో 30,000 ఎకరాలు ఉన్నాయి!: విజయసాయిరెడ్డి ఆరోపణ

  • ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా దీన్ని అప్పగించారు
  • ఇప్పుడు వీళ్లంతా రోడ్డున పడతారని బాబుకు నిద్రపట్టడం లేదు
  • ట్విట్టర్ లో మండిపడ్డ వైసీపీ నేత

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. అమరావతిలోని 30,000 ఎకరాల స్థలం చంద్రబాబు బినామీలు, బంధుగణం చేతిలోనే ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు ముందుగానే వారికి ప్లాన్ అందజేశారని కట్టబెట్టారని విమర్శించారు.

తాజాగా వీరంతా రోడ్డున పడతారని చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ‘అమరావతిని ఖూనీ చేశారు.. రియల్ ఎస్టేట్ ధరలు పతనమయ్యాయి’ అంటూ ఆయన గింజుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

More Telugu News