Rajani: ముంబైలో జోరుగా 'దర్బార్' షూటింగ్

  • పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ 
  • ముంబై నేపథ్యంలో సాగే కథ
  •  సంక్రాంతి పండగకి విడుదల   

ఒక వైపున రజనీ అభిమానులు .. మరో వైపున మురుగదాస్ అభిమానులు 'దర్బార్' సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రజనీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ముంబై నేపథ్యంలో సాగే కథ ఇది. అందువలన కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు అక్కడే జరుగుతోంది. ప్రధాన పాత్రధారులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

సామాజిక సందేశంతో కూడిన ఈ రజనీ మార్క్ చిత్రంలో, కథానాయికగా నయనతార నటిస్తోంది. ఓ ముఖ్యమైన పాత్రలో నివేదా థామస్ కనిపించనుంది. ఈ సినిమా నుంచి ఈ రోజు సాయంత్రం టీజర్ ను వదిలే అవకాశం వుందని మురుగదాస్ ట్వీట్ ను బట్టి తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను తమిళంలోను .. తెలుగులోను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

More Telugu News