Andhra Pradesh: వైఎస్ జగన్ వరం.. 53,000 మంది రైతులకు ప్రయోజనం!: విజయసాయిరెడ్డి

  • ఆక్వా రైతులకు యూనిట్ ను రూ.1.50 కే ఇస్తున్నాం
  • దీనివల్ల ఆక్వా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి
  • టీడీపీ సర్కారు యూనిట్ కు రూ.3.86 వసూలు చేసేది

ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ను రూ.1.50 కే ముఖ్యమంత్రి జగన్ గారు అందించారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఆక్వా రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని వ్యాఖ్యానించారు. దీనివల్ల చాలీచాలని రాబడితో సతమతమవుతున్న 53,000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. గత ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.3.86 చొప్పున అమ్మేదని పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News