Chandrababu: నన్ను మాట్లాడకుండా చేసేందుకు, నన్ను తిట్టేందుకు వైసీపీ ఎమ్మెల్యేలకు మైక్‌ ఇస్తున్నారు: చంద్రబాబు ఆరోపణ

  • వైసీపీ ఎమ్మెల్యేలకు మైక్‌ ఇస్తున్నది ఇందుకే
  • ప్రజల కష్టాలు వివరిద్దామన్నా అవకాశం ఇవ్వడం లేదు
  • దీనిపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం

మాటలు కోటలు దాటినా చేతలు అంగుళం ముందుకు కదలని రీతిలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీరు ఉందని, సభలో ప్రతిపక్షం గొంతునొక్కేసి పబ్బం గడుపుకొంటున్నారని ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు, కన్నీళ్లపై చర్చించేందుకు విలువైన సభా సమయాన్ని వినియోగించాల్సి ఉన్నా ఆ అవకాశమే ఇవ్వడం లేదన్నారు.

'నన్ను మాట్లాడకుండా చేసేందుకు, నన్ను తిట్టేందుకు వైసీపీ ఎమ్మెల్యేలకు మైక్‌ ఇస్తున్నారు' అంటూ విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రభుత్వ విధానాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగతామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులపై శారీరక, మానసిక, ఆర్థిక దాడులకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగానే తాము ర్యాలీ చేపట్టామని స్పష్టం చేశారు.

More Telugu News