Andhra Pradesh: మెగాస్టార్ చిరంజీవితో సమావేశమైన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్!

  • సైరా షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు
  • పలు అంశాలపై చర్చించామన్న మనోహర్
  • చిరంజీవి ప్రయాణం మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని ఆయన సోదరుడు పవన్ కల్యాణ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలుసుకున్నారు. హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్, మనోహర్ చిరంజీవితో భేటీ అయ్యారు.

ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నాదెండ్ల మనోహర్..‘పవన్ కల్యాణ్ గారు, నేను సైరా నరసింహారెడ్డి(చిరంజీవి గారి)ని  కలుసుకున్నాం. ఈ సమావేశం అద్భుతంగా జరిగింది. ఈ భేటీలో మేం చాలా అంశాలపై చర్చించాం. ఆయన జీవిత ప్రయాణం మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. చిరంజీవిగారు మరిన్ని విజయాలు సాధించాలని, ఇలాంటి సమావేశాలు మళ్లీమళ్లీ జరగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

More Telugu News