Andhra Pradesh: జగన్ గారూ.. ఏపీలో ప్రజలంతా ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ అని బ్రతిమాలుతున్నారు!: నారా లోకేశ్

  • ఏదో ఘనకార్యం చేసినట్లు జబ్బలు చరుచుకుంటున్నారు
  • ఆ చీకటి నుంచి ఇప్పటికైనా బయటకు రండి
  • ప్రజలకు కొంచెం కరెంట్ ఇవ్వండి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏదో ఘనకార్యం చేసినట్లు జబ్బలు చరుచుకుంటున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. కానీ బయట ప్రజలు మాత్రం ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ గుర్తును(ఫ్యాన్ ను) బ్రతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇప్పటికైనా జగన్ చీకటిలోంచి బయటకు వచ్చి ప్రజలకు కరెంట్ ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ‘నా ప్రాణం టీడీపీ’ అనే పేజీ నుంచి తీసుకున్నట్లు చెప్పారు.

More Telugu News