Hyderabad: జంటనగరాల గణేశ్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మోహన్‌ భగవత్‌

  • వెల్లడించిన ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు
  • సెప్టెంబర్‌ 2 నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు
  • చివరి రోజు హాజరుకానున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరల్లో ఏటా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా జరిగే గణేశ్ ఉత్సవాల్లో ముగింపు రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, కార్యదర్శి భగవంతరావు ఈ రోజు వెల్లడించారు.

సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి జంటనగరాల్లో వినాయక ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఆ నెల 12వ తేదీతో ముగుస్తాయి. చివరి రోజు నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ను ఆహ్వానించినట్టు వీరు తెలిపారు. 

More Telugu News