assembly: చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని టీడీపీ నిరసన.. శాసన సభ నుంచి వాకౌట్‌

  • సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే నిర్ణయం
  • ఆ తర్వాత కొద్దిసేపటికి సభ వాయిదా
  • మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి సభ

శాసన సభ సమావేశాల నుంచి విపక్ష తెలుగుదేశం పార్టీ వాకౌట్‌ చేసింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే  చంద్రబాబు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభంకాగానే చంద్రబాబునాయుడుకు మైక్‌ ఇవ్వాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇందుకు స్పీకర్‌ అనుమతించక పోవడంతో వారంతా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సభ కూడా వాయిదా పడింది. ఏపీ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి సభ ప్రారంభమవుతుందని స్పీకర్‌ ప్రకటించారు.

More Telugu News