keesaragutta: కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కీసరగుట్ట ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న టీఆర్ఎస్ ఎంపీ

  • కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమం
  • 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్న ఎంపీ జోగినపల్లి
  • ఎకో టూరిజం ప్రాజెక్టును హైదరాబాద్ వాసులకు గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటన

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కీసరగుట్ట రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటున్నట్టు ఆ పార్టీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రకటించారు. ఎంపీ నిధులతో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టుగా మార్చి హైదరాబాద్ వాసులకు గిఫ్ట్‌గా ఇస్తానన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. అటవీ ప్రాంతాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలంటూ కేటీఆర్‌, కవిత, దర్శకుడు పైడిపల్లి వంశీ, నటులు దేవరకొండ విజయ్‌, నితిన్‌, పారిశ్రామికవేత్త ముత్తా గోపాల్‌ను ట్యాగ్‌ చేశారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంపై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ దత్తత నిర్ణయాన్ని ప్రకటించారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి పార్కులు ఎంతగానో తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు.  

More Telugu News