chennai: తిరునల్వేలి మాజీ మేయర్ హత్య!

  • డీఎంకే మాజీ మేయర్ ఉమామహేశ్వరి
  • ఆమెను హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
  • ఆ తర్వాత ఆమె భర్త, పనిమనిషిని చంపేశారు

తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణ ఘటన జరిగింది. డీఎంకే మాజీ మేయర్ ఉమా మహేశ్వరి దారుణహత్యకు గురయ్యారు. తొలుత ఉమామహేశ్వరిని హత మార్చిన దుండగులు, ఆ తర్వాత ఆమె భర్త, పని మనిషినీ చంపేశారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై డీఎంకే నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గతంలో తిరునల్వేలికి మొదటి మహిళా మేయర్ గా ఉమామహేశ్వరి ఎన్నికయ్యారు. 

More Telugu News