Saidharam tej: రాశి ఖన్నాతో సెల్ఫీ తీసిన సాయిధరం తేజ్!

  • షూటింగు దశలో 'ప్రతిరోజూ పండగే'
  • తదుపరి షెడ్యూల్ రాజమండ్రిలో 
  • తేజు - రాశి ఖన్నా జంటగా రెండో సినిమా

సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా 'ప్రతిరోజూ పండగే' సినిమా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా నిర్మితమవుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుపుకుంటోంది.

నాయకా నాయిక కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో రాశి ఖన్నాతో తేజు ఒక సెల్ఫీ తీశాడు. ఆ ఫొటోను తన ట్విట్టర్లో రాశి ఖన్నా పోస్ట్ చేసింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను రాజమండ్రిలో ప్లాన్ చేశారు. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బన్నీవాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో తేజు - రాశి ఖన్నా కాంబినేషన్లో వచ్చిన 'సుప్రీమ్' హిట్ కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి.

More Telugu News