Karnataka: కర్ణాటక రాజకీయం రసవత్తరం.. స్వతంత్ర ఎమ్మెల్యేలున్న అపార్టుమెంట్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు!

  • ఓ అపార్టు మెంట్ లో ఇధ్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు
  • ఆ అపార్టుమెంట్ ను చుట్టుముట్టిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
  • లోపలికి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ బల నిరూపణకు ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు స్పీకర్ మరో డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయం లోపు సీఎం కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా, కర్ణాటకలోని ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కోసం సంకీర్ణ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తున్నాయి.

ఈ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ అపార్టు మెంట్ లో ఉన్నారు. ఈ సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆ అపార్టుమెంట్ ను చుట్టుముట్టారు. ఎమ్మెల్యేలను కలిసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. అయితే, అపార్టుమెంట్ లోపలికి తమను అనుమతించకపోవడంతో, ఓ దశలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.  

More Telugu News