Hyderabad: కేపీహెచ్బీలో బ్యూటీషియన్ ఆత్మహత్య!

  • కేపీహెచ్బీకి చెందిన సత్య శిరీష బ్యూటీషియన్
  • కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం
  • భర్త బయటకెళ్లిన సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య

హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో బ్యూటీషియన్ సత్య శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. కొంతకాలంగా ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నట్టు సమాచారం. తన భర్త బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి  ఉంది. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని దొమ్మేరు ఆమె స్వగ్రామం.

More Telugu News