Uttar Pradesh: కుక్క కరుస్తుందన్న భయంతో ఓ ఇంట్లో దూరితే... దొంగనుకొని చంపేశారు!

  • యూపీలోని బారాబంకీలో ఘటన
  • మందు కొట్టి వస్తున్న వ్యక్తి వెంటపడ్డ శునకం
  • కట్టేసి.. దారుణ హత్య

ఎక్కడ కుక్క కరుస్తుందోనన్న భయంతో తెలియని ఇంట్లోకి వెళ్లిన ఓ వ్యక్తిని, దొంగన్న అనుమానంతో చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పట్టణానికే చెందిన ఓ వ్యక్తి, మద్యం తాగి, తన అత్తగారింటికి వెళుతుండగా, ఓ వీధికుక్క వెంటబడింది.

 దాని బారిన పడాల్సి వస్తుందన్న ఆందోళనతో పక్కనే కనిపించిన ఓ ఇంట్లోకి దూరాడు. అప్పటికే అతను పూటుగా మద్యం తాగి ఉండటంతో, అతను విషయాన్ని విడమరచి చెప్పలేకపోయాడు. తమ ఇంట్లో దొంగతనానికి వచ్చాడని భావించిన ఇంట్లోని వారంతా ఏకమై, అతన్ని బంధించి, ఇనుపచువ్వలతో కాల్చి చిత్ర హింసలు పెడుతూ కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు.

More Telugu News