Amaravati: రాజధాని అమరావతిలో విషాదం... లిఫ్ట్ ప్రమాదంలో ముగ్గురి మృతి

  • పైనుంచి దూసుకువచ్చిన లిఫ్టు
  • ఐదో అంతస్తులో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు
  • లిఫ్టు కిందపడి దుర్మరణం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూడి వద్ద ప్రమాదం జరిగింది. లిఫ్ట్ కిందపడి ముగ్గురు టెక్నీషియన్లు ప్రాణాలు కోల్పోయారు. రాయపూడిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయం వద్ద లిఫ్ట్ ఒక్కసారిగా కిందకుపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ కాంప్లెక్స్ లోని ఐదో అంతస్తులో బీహార్ కు చెందిన రాహుల్ కుమార్, సురేంద్ర, కృపాల్ పనిచేస్తుండగా లిఫ్ట్ పైనుంచి దూసుకువచ్చింది. దాంతో ఆ ముగ్గురు సాంకేతిక నిపుణులు తీవ్రగాయాలతో మృతి చెందారు. ఈ ఘటనలో రాజధాని ప్రాంతంలో విషాదం నెలకొంది.

More Telugu News