Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ.. పలు కీలక అంశాలపై సమాధానాలు రాబట్టే యత్నం

  • మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు కేసు
  • ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ
  • విదేశాలకు నగదు తరలింపుపై ఆరా

2007లో గనుల అక్రమాల విషయంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి భారీగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో జరుగుతున్న ఈ విచారణ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. పలు కీలక అంశాలపై అధికారులు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా విదేశాలకు నగదు తరలించడంపై అధికారులు జనార్దన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

More Telugu News