Rupesh: మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీగా '22'

  • మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
  • నాయకా నాయికలకు తొలి సినిమా
  • ఈ నెల 29 నుంచి రెగ్యులర్ షూటింగ్

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో మరో థ్రిల్లర్ మూవీ రూపొందనుంది .. ఆ సినిమా పేరే '22'. రూపేశ్ కుమార్ - సలోని మిశ్రా నాయకా నాయికలుగా పరిచయమవుతున్న ఈ సినిమాకి శివకుమార్ బి. దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. దివంగత దర్శకురాలు జయ.బి - బీఏ రాజు దంపతుల కుమారుడే ఈ శివకుమార్.

హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరో హీరోయిన్లపై వెంకటేశ్ క్లాప్ ఇవ్వగా, ముహూర్తపు సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 29 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జరుగుతుందనీ, కథకీ .. 22 అనే నెంబర్ కి గల సంబంధం ఏమిటనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని దర్శకుడు శివకుమార్ బి. చెప్పాడు.

More Telugu News