Narendra Modi: సర్వం భారతీయం... చంద్రయాన్-2పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

  • కొనసాగుతున్న చంద్రయాన్-2
  • దేశీయ పరిజ్ఞానంతో రూపొందించడంపై మోదీ హర్షం
  • భారత శాస్త్రవేత్తల శక్తిసామర్ధ్యాలకు గీటురాయి అంటూ కితాబు

భారత్ చంద్రయాన్-2 ప్రయోగం గురించి గర్వంగా చెప్పుకోవడానికి కారణం అందులో ఉపయోగించిన సాంకేతికత అంతా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిందే. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇప్పుడు దాని గురించే ప్రస్తావించారు. సర్వం భారతీయం అంటూ ట్వీట్ చేశారు. భారత సత్తా, భారత స్ఫూర్తి అంటూ ట్వీట్ మొదలుపెట్టిన మోదీ, ప్రతి ఒక్కరూ ఉప్పొంగిపోతున్నారంటూ అందుకు కారణం చంద్రయాన్-2 పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారుకావడమేనని ఉద్ఘాటించారు.

దీంట్లో చంద్రుడి అణువణువును పరిశోధించేందుకు ఆర్బిటర్ ఉందని, చంద్రుడి ఉపరితలాన్ని నిశితంగా విశ్లేషించేందుకు ల్యాండర్ రోవర్ మాడ్యూల్ ఉందని ప్రధాని వివరించారు. భారత శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలకు చంద్రయాన్-2 ప్రాజక్టు ఓ గీటురాయిలా నిలుస్తుందని, శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త ద్వారాలు తెరిచేక్రమంలో 130 కోట్ల మంది భారతీయుల దృఢసంకల్పానికి ఇది ప్రతీక అని మోదీ కొనియాడారు. చంద్రయాన్-2 ప్రయోగం యువమేధావులను సైన్స్, అత్యున్నత పరిశోధనలు, ఆవిష్కరణల రంగం దిశగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. 

More Telugu News