Nagarjuna: 'మన్మథుడు 2' నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది

  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'మన్మథుడు 2'
  • ప్రత్యేకమైన పాత్రలో సమంత
  •  వచ్చేనెల 9న విడుదల 

నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నాగార్జున సరసన రకుల్ .. కీర్తి సురేశ్ నటించారు. వచ్చేనెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నెల 25వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ వదలనున్నారు. సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ను కట్ చేస్తున్నారట. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు 7.4 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. నాగార్జున .. జెమినీ కిరణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో, సమంత ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 

More Telugu News