Kesineni Nani: కాల్ మనీ రెచ్చిపోతోంది... డీజీపీ గారూ, కాపాడండి: కేశినేని నాని

  • ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
  • కాల్ మనీ గురించి మీకే ఎక్కువ తెలుసు
  • ప్రజలను కాపాడాలని ట్వీట్

ఏపీలో కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, డీజీపీ వెంటనే కల్పించుకుని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కోరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, కాల్ మనీ మాఫియా గురించి అందరి కన్నా మీకే ఎక్కువ తెలుసునని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మాఫియా బారిన పడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డీజీపీలు కాపాడాలని కోరారు. "డీజీపీ గారు కాల్ మనీ మాఫీయా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఈ రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ మీకే తెలుసు కాల్మని మాఫీయా బారిన పేద ప్రజలు పడకుండా కాపాడండి సార్" అంటూ సీఎం వైఎస్ జగన్ ను సైతం ట్యాగ్ చేశారు. 

More Telugu News