Andhra Pradesh: కేంద్రం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయం ఉపసంహరణ: ప్రపంచ బ్యాంకు

  • అమరావతికి రుణం కోసం గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది
  • వైఎస్ జగన్ ఫ్రభుత్వం వచ్చాక ఆ రుణం నిలిపివేత
  • ఆ ప్రతిపాదన ఉపసంహరించుకుని కేంద్రానికి లేఖ రాశాం 

ఏపీ రాజధాని అమరావతికి  ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేసిన విషయం తెలిసిందే. అమరావతికి రుణ ప్రతిపాదనను ఎందుకు రద్దు చేసిన విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. రాజధాని మౌలిక వసతుల అభివృద్ధికి రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకుకు ఏపీలోని గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుని కేంద్రానికి ఈ నెల 15న లేఖ రాసినట్టు చెప్పారు.

More Telugu News