kishan: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలను తగలబెట్టిన యువకుడు

  • పాతబస్తీలోని ఆసిఫ్ నగర్ లో పర్యటించిన కిషన్ రెడ్డి
  • ఆ యువకుడిని చితకబాదిన బీజేపీ శ్రేణులు
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు

కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఈరోజు పర్యటించారు. పాతబస్తీలోని ఆసిఫ్ నగర్ లో కిషన్ రెడ్డి పర్యటిస్తున్న సమయంలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. కిషన్ రెడ్డి ఫ్లెక్సీలను ఓ యువకుడు తగలబెట్టాడు. వెంటనే అప్రమత్తమైన బీజేపీ శ్రేణులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. ఈ క్రమంలో యువకుడి తరపు వర్గానికి బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

More Telugu News