westindies: వెస్టిండీస్ టూర్ కు భారతజట్టు ప్రకటన

  • మూడు ఫార్మాట్లకు జట్టును ప్రకటించిన బీసీసీఐ
  • ఈ టూర్ కు ధోనీ దూరం
  • మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ 

వెస్టిండీస్ టూర్ కు భారతజట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆగస్టు మూడో తేదీ నుంచి మూడు టీ-20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్ లలో విండీస్ తో భారత్ తలపడనుంది. ఆయా జట్లకు టీమిండియా ప్లేయర్ల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, కీపర్ గా పంత్ వ్యవహరించనున్నారు. ఈ టూర్ కు ధోనీ దూరం కావడం గమనార్హం.  

టీ-20 జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, కే ఎల్ రాహుల్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్,  భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ ఉన్నారు.

వన్డే జట్టు: 
 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, కే ఎల్ రాహుల్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, కేదార్ జాదవ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ

 టెస్టు జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానె (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, కే ఎల్ రాహుల్, సి పుజారా, హనుమ విహారి, రోహిత్ శర్మ, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్

More Telugu News