TAJ MAHAL: తాజ్ మహల్ శివాలయమే.. ప్రతీ సోమవారం పూజలు నిర్వహిస్తాం!: శివసేన

  • శివసేన ప్రకటనపై ఏఎన్ఐ ఆందోళన
  • భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వానికి లేఖ
  • తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించలేదన్న శివసేన

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం శివసేన భద్రతపై భారత పురావస్తు శాఖ(ఏఎన్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. తాజ్ మహల్ కు హాని జరిగే ప్రమాదముందనీ, కాబట్టి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.

తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించలేదనీ, అది శివాలయమని పలు హిందుత్వ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అడుగు ముందుకేసిన శివసేన పార్టీ (ఆగ్రా విభాగం) ప్రతీ సోమవారం తాజ్ మహల్ లో హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏఎన్ఐ తాజ్ మహల్ కు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాసింది.

More Telugu News