Andhra Pradesh: జగన్ గారూ.. ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేకపోతే రాష్ట్రాన్ని ముందుకెలా తీసుకెళతారు?: కేశినేని

  • విజయవాడ కార్పొరేషన్ లో 4 నెలలుగా జీతాల్లేవు
  • ఏపీ ముఖ్యమంత్రికి ప్రశ్న సంధించిన టీడీపీ ఎంపీ
  • ట్విట్ కు ముఖ్యమంత్రి జగన్ ను ట్యాగ్ చేసిన నాని

తెలుగుదేశం నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఏపీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో గత 4 నెలలుగా ఉద్యోగులకు వేతనాలు అందకపోవడంపై ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ‘మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేకపోతే మీరు రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకువెళతారు ముఖ్యమంత్రిగారూ?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కేశినేని నాని ఓ పత్రికలో ప్రచురితమైన కథనం క్లిప్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు.

More Telugu News