Maharashtra: పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

  • జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ
  • కారులోని వారంతా ఘటనా స్థలంలోనే మృతి
  • లారీ అతి వేగమే ప్రమాదానికి కారణమన్న పోలీసులు

మహారాష్ట్రలోని పూణె శివారులో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూణె-షోలాపూర్ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వస్తున్న లారీ పూణె శివారులోని కదంవక్ వాస్తి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 9 మందీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను పూణె సమీపంలోని యవత్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News