Karnataka: యడ్యూరప్ప మళ్లీ సీఎం కావాలని కోరుతూ 1001 మెట్లెక్కిన బీజేపీ మహిళా ఎంపీ!

  • చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • ఆ ఆలయానికి మెట్లెక్కి వెళ్లిన ఎంపీ శోభ కరండ్లజే
  • ఆమె వెంట బీజేపీ కార్యకర్తలు, అభిమానులు

కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం మనుగడ రేపో మాపో అన్నట్టుగా వున్న సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షకు సంకీర్ణ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ, ఎడ తెగని చర్చలు, సభ వాయిదాలు పడుతుంటంతో విశ్వాసపరీక్ష ఏ రోజుకారోజు వాయిదాపడుతూ వస్తోంది. బలపరీక్షలో నెగ్గుతామని కాంగ్రెస్-జేడీఎస్ ధీమా వ్యక్తం చేస్తుండటం, సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెబుతుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారే కాదు, మొక్కులు మొక్కు కుంటున్న వారూ లేకపోలేదు. బీజేపీ ఎంపీ శోభ కరండ్లజే అయితే మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ ఆలయానికి ఆమె వెళ్లేందుకు 1001 మెట్లను ఎక్కారు. ఆమె వెంట పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

More Telugu News