Telangana: నేను ఏ పార్టీలోకి పోలేను.. నన్నెవరు తీసుకున్నా మనశ్శాంతితో ఉండలేరు: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • నాతో ఇబ్బందులు ఉంటాయి
  • లేనిపోని సమస్యలు వస్తాయి
  • నా జాగాలో నేను ఉండటమే కరెక్టు

సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారతారన్న వదంతులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయమై ఆయన వివరణ ఇస్తూనే ఉన్నారు. తాజాగా, ఇదే అంశంపై ప్రశ్నించిన మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ, తాను ఏ పార్టీలోకి పోలేనని, తనను ఏ పార్టీ వాళ్లు తీసుకున్నా మనశ్శాంతితో ఉండలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎందుకు?‘ అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘నాతో ఇబ్బందులు ఉంటాయి. లేనిపోని సమస్యలు వస్తాయి. నా జాగాలో నేను ఉండటమే కరెక్టు’ అని చెప్పారు.

More Telugu News