Andhra Pradesh: తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజీ హాస్టల్ లో భారీ చోరీ!

  • 300 మంది విద్యార్థినుల కమ్మలు, పట్టీలు, నగదు తస్కరణ
  • యువతులు కాలేజీకి వెళ్లిన సమయంలో చోరీ
  • ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయని యాజమాన్యం

తిరుపతిలో ఉన్న శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజీలో భారీ చోరీ చోటుచేసుకుంది. విద్యార్థినులు కాలేజీకి వెళ్లగానే హాస్టల్ లోని హరిణి బ్లాక్ లోకి చొరబడ్డ దొంగలు బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ నెల 15న ఈ ఘటన చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనలో 300 మంది యువతులకు చెందిన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని సమాచారం. రూ.50,000 నగదుతో పాటు బంగారు కమ్మలు, చెవిదుద్దులు, కాళ్ల పట్టీలు దొంగతనానికి గురయ్యాయని తెలుస్తోంది. కాగా, ఈ వ్యవహారంపై విద్యార్థినులు, హాస్టల్ యాజమాన్యం ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.

More Telugu News