Vijayasai reddy: మంగళగిరి 'ఎయిమ్స్' సభ్యుడిగా విజయసాయిరెడ్డి

  • దేశంలోని 9 ఎయిమ్స్ సంస్థలకు ఎన్నికలు
  • గతవారం లోక్‌సభ నుంచి ధర్మపురి అరవింద్, సత్యవతి ఎన్నిక
  • రాజ్యసభ నుంచి విజయసాయి ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలోని 9 ఎయిమ్స్ సంస్థలకు పార్లమెంట్ నుంచి ఎన్నికలు నిర్వహించారు. గత వారం లోక్‌సభ నుంచి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, సత్యవతి ఎయిమ్స్ సభ్యులుగా ఎన్నికయ్యారు. తాజాగా విజయసాయిరెడ్డి మంగళగిరి ఎయిమ్స్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

More Telugu News