Karnataka: విశ్వాసపరీక్షకు డెడ్ లైన్ విధించిన కర్ణాటక గవర్నర్

  • కర్ణాటకలో మరో ఆసక్తికర పరిణామం
  • సీఎం కుమారస్వామికి గవర్నర్ లేఖ
  • రేపు మధ్యాహ్నం 1.30 గంటల లోపు మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశం 

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం విశ్వాసపరీక్ష రేపటికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే. ఏది ఏమైనా సరే, ఈరోజే విశ్వాసపరీక్ష జరగాలంటూ సభలోనే బీజేపీ నేతలు బైఠాయించి, నిరసనలు తెలిపారు. తాజాగా, మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక సీఎం కుమారస్వామికి ఆ రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా ఓ లేఖ రాశారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటల లోపు కాంగ్రెస్-జేడీఎస్ లు వారి మెజార్టీ నిరూపించుకోవాలని సూచించారు.

More Telugu News