Mahesh Babu: యూట్యూబ్ వీడియో ప్రపంచంలోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు కుమార్తె

  • 'ఏ అండ్ ఎస్' యూట్యూబ్ చానల్ ప్రారంభం
  • దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తెతో భాగస్వామ్యం
  • వీడియో షేర్ చేసిన మహేశ్ బాబు

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు కుమార్తె సితార యూట్యూబ్ లో ఓ చానల్ ప్రారంభించింది. ఈ చానల్ పేరు 'ఏ అండ్ ఎస్'. ఇందులో 'ఏ' అంటే ఆద్య. ఈ అమ్మాయి ఎవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె. ఇక 'ఎస్' అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో ఏ అండ్ ఎస్ యూట్యూబ్ చానల్ ఆరంభించారు. మొదటి వీడియోగా '3 మార్కర్స్ చాలెంజ్' పేరుతో ఓ వీడియో రూపొందించారు.

చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. యూట్యూబ్ లో ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ఇక, ఈ గుడ్ ఫ్రెండ్స్ కోసం మహేశ్ బాబు కూడా రంగంలోకి దిగారు. సితార, ఆద్య రూపొందించిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసి కావాల్సినంత ప్రచారం కల్పించారు.

More Telugu News