Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

  • కూలీలతో వెళుతున్న ట్రక్కు
  • అన్నా నగర్ ఫ్లై ఓవర్ వద్ద బలంగా ఢీకొన్న ప్రయివేటు బస్సు
  • బస్సు, ట్రక్ డ్రయివర్లు కూడా మృతి

కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన ఆ కూలీల ప్రాణాలు నడిరోడ్డుపై గాల్లో కలిసిపోయాయి. తమిళనాడులో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. తిరువూరు జిల్లాలో విద్యుత్ లైన్లు వేసేందుకు కాంచీపురం జిల్లా నుంచి 14 మంది కూలీలు ఓ ట్రక్కులో బయల్దేరారు. విల్లుపురం జిల్లా కల్లకుర్చి వద్దకు రాగానే అన్నా నగర్ ఫ్లై ఓవర్ వద్ద ఓ ప్రయివేటు బస్సు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలతో పాటు బస్సు, ట్రక్ డ్రయివర్లు కూడా మరణించారు. కాగా, మృతి చెందిన కూలీలు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు.

More Telugu News