Karnataka: అటు కన్నడ రాజకీయ క్రీడ.. ఇటు యడ్యూరప్ప క్రికెట్ క్రీడ!

  • బెంగళూరులోని ఓ హోటల్ ప్రాంగణంలో క్రికెట్
  • బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆట ఆడిన యడ్డీ
  • సామాజిక మాధ్యమాలకు చేరిన ఫొటో

కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి త్వరలో తెరపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 18న కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోనుంది. ఈ తరుణంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. బెంగళూరులోని రమాదా హోటల్ ప్రాంగణంలో తమ ఎమ్మెల్యేలతో కలిసి క్రికెట్ ఆడటం గమనార్హం. యడ్యూరప్ప క్రికెట్ బ్యాట్ పట్టి ఆడుతున్న ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరింది.

More Telugu News