puri: బాలయ్యకి తప్పకుండా ఒక హిట్ ఇస్తా: దర్శకుడు పూరి

  • అభిమానులు కొత్త రామ్ ను చూస్తారు
  • ఇది ఏ సినిమాకి కాపీ కాదు
  • బాలయ్య కోసం కథ రెడీ చేస్తాను  

పూరి జగన్నాథ్ తాజా చిత్రంగా 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం రూపొందింది. రామ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పూరి బిజీగా వున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, " ఇంతవరకూ రామ్ ను ఎవరూ చూపించనంత డిఫరెంట్ గా నేను ఈ సినిమాలో చూపించాను. ఆయనలోని ఎనర్జీని నేను పూర్తిస్థాయిలో వాడుకున్నాను. రామ్ అభిమానులు ఈ సినిమాలో కొత్త రామ్ ను చూస్తారు. ఇక ఈ సినిమా ఒక హాలీవుడ్ మూవీకి రీమేక్ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఇక నాకు ఇష్టమైన బాలయ్యకు 'పైసా వసూల్'తో హిట్ ఇవ్వలేకపోయాననే అసంతృప్తి నాలో వుంది. ఆయన కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ తయారు చేస్తాను. ఆయనకి తప్పకుండా హిట్ ఇస్తాను" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News