Vijayawada: ‘అగ్రిగోల్డ్’ డైరెక్టర్ హేమసుందర వరప్రసాద్ అరెస్టు

  • బినామీ పేర్లతో రూ.7.32 కోట్ల విలువైన ఆస్తులు
  • విజయవాడలో పలు ఆస్తుల గుర్తింపు
  • రూ.7.32 కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలు

గతంలో అగ్రిగోల్డ్ సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరించిన హేమసుందర వరప్రసాద్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బినామీ పేర్లతో రూ.7.32 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7 రకాల స్థిరాస్తులు ఆయన బినామీల పేరుతో ఉన్నాయి. విజయవాడలోని పటమట, గుండాల, కంకిపాడు, కృష్ణా జిల్లాలోని నూజివీడులో, గన్నవరంలో కూడా వరప్రసాద్ కు స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించారు.

More Telugu News