Vijay Sai Reddy: చంద్రబాబు ఉవాచ... రూ. 2 వేలు కన్నా రూ. 15 వేలు తక్కువట: విజయసాయిరెడ్డి సెటైర్!

  • నమ్మకుంటే ధర్నాలు చేయిస్తారట
  • విద్యార్థుల భోజనానికి బదులు 15 వేలు ఇస్తే దారుణమా
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి

రెండు వేల రూపాయల కన్నా, రూ. 15 వేలు తక్కువని చంద్రబాబు అంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "2 వేల కంటే 15 వేలు తక్కువని చంద్రబాబు చెబితే నమ్మాలి. కాదంటే ధర్నాలు చేయిస్తారట. ఎన్నికల ముందు ఇంటర్ విద్యార్ధులకు ప్రవేశపెట్టిన మధ్యాహ్నభోజనం ఏడాది ఖర్చు 2 వేలు. విద్యార్ధులను ఆర్థికంగా ఆదుకునేందుకు భోజనానికి బదులుగా ఏటా 15 వేలు ఇస్తామని జగన్ గారు చెబితే  దారుణం అంటున్నారు బాబు" అని ఆయన అన్నారు. 

More Telugu News