Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో కుప్పకూలిన భవనం... శిథిలాల కింద జవాన్లు!

  • అల్పాహారం కోసం ఆగిన ఆర్మీ జవాన్లు  
  • ఉన్నట్టుండి కూలిపోయిన మూడంతస్తుల హోటల్  
  • సహాయచర్యలు ముమ్మరం చేసిన అధికారులు

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 15 మంది ఆర్మీ జవాన్లు సహా 35 మంది చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. అధికారులు సహాయకచర్యలు ముమ్మరం చేశారు.

కాగా, కుప్పకూలిన భవనం ఓ హోటల్. మూడంతస్తుల ఈ హోటల్ ఉన్నట్టుండి నేలమట్టం అయింది. ఆ సమయంలో 50 మంది జవాన్లు అల్పాహారం కోసం హోటల్ వద్ద ఆగారు. భవనం కూలిపోవడంతో వాళ్లలోని 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది.

More Telugu News