Mob Lynching: మూకుమ్మడి దాడులకు బీజేపీ, ఆరెస్సెస్ కాదు.. కాంగ్రెసే ప్రధాన కారణం: జమాతే ఉలేమా హింద్ అధ్యక్షుడు

  • కాంగ్రెస్ పాలనలో చోటు చేసుకున్న దాడులపై విచారణ జరిపించాలి
  • విచారణ జరిగితే కాంగ్రెస్ పాత్ర వెలుగుచూస్తుంది
  • గౌహతిలో సంచలన వ్యాఖ్యలు చేసిన మౌలానా సుహేబ్

దేశ వ్యాప్తంగా పలు చోట్ల మైనార్టీలపై మూకుమ్మడి దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జమాతే ఉలేమా హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సుహేబ్ క్వాస్మి స్పందిస్తూ... మూకుమ్మడి దాడులకు బీజేపీ, ఆరెస్సెస్ కారణం కాదని... కాంగ్రెస్ పార్టీనే దీనికి ప్రధాన కారణమని మండిపడ్డారు. గౌహతిలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూకుమ్మడి దాడులపై ఉన్నత స్థాయి విచారణ జరిపితే... కాంగ్రెస్ పాత్ర వెలుగు చూస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో చోటు చేసుకున్న మూకుమ్మడి దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

More Telugu News