Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల!

  • ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి 
  • 65.15 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వ్యాఖ్య
  • పరీక్షకు హాజరైన 40,000 మంది విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈరోజు ఫలితాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ పరీక్షలో 66.15 శాతం ఉత్తీర్ణత నమోదయిందని తెలిపారు. దాదాపు 40,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారని చెప్పారు. ఏపీలో గత నెల 17 నుంచి 29 వరకూ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. కాగా, ఈ పరీక్షా ఫలితాలను http://push159.sps.ap.gov.in/interresults/APResult.aspx వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

More Telugu News