Telangana: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులే లేవని కేటీఆర్ అన్నారు.. అదంతా అవాస్తవం!: ధర్మపురి అరవింద్

  • గతంలో ట్విట్టర్ లో విమర్శించిన కేటీఆర్
  • కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టిన సంజయ్
  • ట్విట్టర్ లో బడ్జెట్ కేటాయింపుల జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించలేదనీ, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. ‘తెలంగాణకు బడ్జెట్ లో కేటాయింపులే జరపలేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెబుతున్నారు.

కేంద్ర రైల్వే శాఖ తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఇవిగో’ అంటూ ఓ జాబితాను ధర్మపురి అరవింద్ విడుదల చేశారు. ఈ ట్వీట్ కు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ, తెలంగాణ బీజేపీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులను ట్యాగ్ చేశారు.

More Telugu News