Andhra Pradesh: ఏపీలో నేడు, రేపు అర్చక ఆగమ పరీక్షలు.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఏపీ మంత్రి వెల్లంపల్లి!

  • ప్రశ్నాపత్రాల సెట్ విడుదల చేసిన మంత్రి
  • పరీక్షా కేంద్రాల్లో అన్నిసౌకర్యాలు కల్పించినట్లు వ్యాఖ్య
  • కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మల్లాది, దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ

ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు అర్చక ఆగమ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్చకులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయవాడ బందరురోడ్డులోని స్టేట్ గెస్ట్ హౌస్ లో ఈరోజు మంత్రి అర్చక ఆగమ పరీక్షల ప్రశ్నాపత్రాల సెట్ ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీలోని 13 జిల్లాల్లో 7,687 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. అర్చకులు పరీక్షలు రాయడానికి వీలుగా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు.

More Telugu News