Kannababu: కాకినాడలో కన్నబాబును పరామర్శించిన చిరంజీవి

  • కాకినాడకు వచ్చిన చిరంజీవి
  • ప్రజారాజ్యంలో కీలక నేతగా కన్నబాబు
  • పరామర్శ అనంతరం కాసేపట్లోనే తిరుగు పయనం

ఏపీ వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్ అంత్యక్రియలు నేడు కాకినాడలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి నేడు కన్నబాబును పరామర్శించారు. కన్నబాబుకు చిరంజీవితో మంచి సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కన్నబాబు కీలక నేతగా వ్యవహరించారు. ఆ అనుబంధంతోనే చిరంజీవి నేడు ప్రత్యేకంగా కాకినాడకు వచ్చి కన్నబాబు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వెంటనే ఆయన కాకినాడ నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. 

More Telugu News