Kumaraswamy: విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నాం.. టైమ్ ఫిక్స్ చేయండి: కుమారస్వామి

  • దేనికైనా సిద్ధంగా ఉన్నా
  • అధికారంలోనే ఉండాలని కోరుకోవడం లేదు
  • కొందరు ఎమ్మెల్యేల కారణంగా అనిశ్చితి నెలకొంది

కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మీడియాతో ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని... టైమ్ ఫిక్స్ చేయాలని స్పీకర్ ను కోరారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలనే నిర్ణయానికి తాను వచ్చానని తెలిపారు. దేనికైనా తాను సిద్ధంగా ఉన్నానని... అధికారంలోనే ఉండాలని తాను భావించడం లేదని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేల కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొందని... ఎన్నో పరిణామాలు సంభవిస్తున్నాయని అన్నారు.

More Telugu News