కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు మాధవి

- ట్విట్టర్ లో స్పందించే పిట్ట కేటీఆర్
- 9 నెలల చిన్నారిపై అఘాయిత్యం జరిగినా ప్రభుత్వం స్పందించలేదు
- చట్టాలలో కాదు.. కేసీఆర్ లో మార్పు రావాలి
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయని మాధవి విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపాలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. 100 రోజుల ప్రణాళికలో మున్సిపాలిటీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలలో మార్పు కాదని... ముఖ్యమంత్రి కేసీఆర్ లో మార్పు రావాలని అన్నారు. వార్డులను శాస్త్రీయత లేకుండా విభజిస్తున్నారని... ఇది కేసీఆర్ పిరికితనాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ చేసిన వాగ్దానాలను బీజేపీ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుందని చెప్పారు.