Rana: 'ఓ బేబీ'ని బాలీవుడ్ కి తీసుకెళ్లే ఆలోచనలో రానా

  • భారీ విజయాన్ని అందుకున్న 'ఓ బేబీ'
  • హిందీలో రీమేక్ చేసే ఉద్దేశంతో రానా
  •  ఆ హీరోయిన్స్ లో ఒకరికి ఛాన్స్    

కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'ని 'ఓ బేబీ' పేరుతో తెలుగులోకి రీమేక్ చేయగా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చేసుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకి వసూళ్లతో పాటు ప్రశంసలు దక్కుతుండటం విశేషం.

 దాంతో ఈ సినిమాపై రానా దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని సమాచారం. హిందీలో అలియా భట్ తో గానీ, కంగనాతో గాని ఈ రీమేక్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన వున్నాడని చెబుతున్నారు. అంతేకాదు 'ఓ బేబీ'లో సమంతను ప్రేమించే యువకుడిగా నాగశౌర్య నటించాడు. ఈ పాత్రను హిందీలో తాను పోషించాలనే ఆలోచనలో రానా వున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం వుంది. 

More Telugu News