samantha: సస్పెన్స్ థ్రిల్లర్ కి సన్నాహాలు .. నిర్మాతలుగా చైతూ, సమంత

  • 'ఓ బేబీ'తో హిట్ అందుకున్న సమంత
  •  నందినీ రెడ్డితో మరో సినిమా
  •  త్వరలోనే పట్టాలపైకి  

నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా చేసిన 'ఓ బేబీ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ కాంబినేషన్లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.

ఈ కథ కూడా సమంత చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ కథపై నందినీరెడ్డి కసరత్తు చేస్తోంది. ఈ సినిమాను చైతూ, సమంతలు కలిసి నిర్మించాలనుకుంటున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. కథపై వున్న నమ్మకంతోనే సమంత ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో నందినీరెడ్డి వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

More Telugu News